ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సంభవించిన వరదల్లో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు ఆర్థికసాయం అందించారు. తిరుపతిలో జరిగిన ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి గారితో పాటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈఓ కె. రాజేంద్రకుమార్ రిటైర్డ్ ఐపీఎస్ పాల్గొన్నారు.
![](https://ntrtrust.org/wp-content/uploads/2021/12/269686552_1899930203548570_7646975018224595501_n.jpg)
![](https://ntrtrust.org/wp-content/uploads/2021/12/268074637_1899930206881903_2105114252986047214_n.jpg)
![](https://ntrtrust.org/wp-content/uploads/2021/12/269683022_1899930186881905_359504852481660545_n.jpg)
![](https://ntrtrust.org/wp-content/uploads/2021/12/269743092_1899930750215182_1976696640059340844_n.jpg)
![](https://ntrtrust.org/wp-content/uploads/2021/12/269533396_1899930486881875_8210055808192676923_n.jpg)
![](https://ntrtrust.org/wp-content/uploads/2021/12/268371588_1899930660215191_9173331690543815409_n.jpg)
స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి వీరిరువురు పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో వరదల కారణంగా అకాల మరణం పొందిన వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత 48 మంది మృతుల కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష చొప్పున, చెక్కులను నారా భువనేశ్వరి గారు అందించారు
ఈ సందర్భంగా భువనేశ్వరి గారు మాట్లాడుతూ భావజాలాలు వేరైనా విపత్తుల సమయంలో అందరూ ఒక్కటిగా కలిసి వచ్చి బాధితులకు సాయం చేయాలన్నారు. నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసిన ఎన్టీఆర్ ఆశయాన్ని ట్రస్ట్ ముందుకు తీసుకువెళ్తుందని ఆమె అన్నారు