తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా, హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు.










అనంతరం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలను అభినందించి వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే, ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంలో రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈఓ కె. రాజేంద్రకుమర్ ఐపిఎస్ (రిటైర్డ్), సి.ఓ.ఓ అడుసుపల్లి గోపీ మరియు ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
