మానవసేవే మాధవసేవ
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహామ్మారి విజృంభిస్తున్న వేల సామాన్య ప్రజలు, ఆసుపత్రులకు వస్తున్న భాధితులు, మరియు వారి వెంట వచ్చే సహాయకులు తినడానికి ఆహారం కూడా లభించక ఇబ్బందులకు గురవుతున్న సమయంలో దీనిపై దృష్టిసారించిన ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేము సైతం ప్రజలకు భరోసానిస్తూ భోజన సదుపాయలను సమకూర్చుతుంది.
ఇందులో భాగంగానే ఈరోజు చిత్తూరు జిల్లాలోని కుప్పం గ్రామంలో ప్రజల రోగనిరోధక శక్తి పెంచడానికి దోహదపడే వంటలు రాగి సంగటి, ఉలవచారు, పెరుగు, చిక్కుడుకాయ తాలింపు, అన్నం, ఆకు కూర పప్పు అందించారు.